శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 07- 08 -2010 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య - సంసారిగ మారి యోగి సంతసమందెన్
కం: శాంసన్ యోగీ నక్సల్
హంసా లక్ష్మిని వరించి యామెయె జెప్పన్
హింసా ప్రవృత్తిని విడచి
సంసారిగ మారి యోగి సంతసమందెన్.
సమస్య - సంసారిగ మారి యోగి సంతసమందెన్
కం: శాంసన్ యోగీ నక్సల్
హంసా లక్ష్మిని వరించి యామెయె జెప్పన్
హింసా ప్రవృత్తిని విడచి
సంసారిగ మారి యోగి సంతసమందెన్.
4 comments:
పూట పూటకు మాతాకవళం అనలేక,
ఆ మాత జగన్మాత ధ్యానించి
జ్ఞాని అయి 'కాళీ' దాసుడై,
సంసారిగ మారి యోగి సంతసమందెన్
పరశురాముడు, 21 మారులు క్షత్రియ సంహారము చేసి, యుద్ధములను ఏవగించుకొనుచూ తిరిగి హంసాకృతి = పరమేశ్వరిని, ద్యానిస్తూ............ అనే అర్థములో...
హింసావిదూరుడయివి
ధ్వంసంబులనేవగించి బైరాగివలెన్,
హంసాకృతిజపముల ని
స్సంసారిగ మారి యోగి సంతసమందెన్.
హనుమచ్చాస్త్రి గారూ,
మీ పద్యములో మూడవ పాదములో మూడవ గణము తప్పినదనుకొంటాను. విడచి బదులుగా విడచుచు అంటె సరిపోతుందని నా భావన.
జిలేబి గారూ ! చక్కని వూహ జేశారు. బాగుంది.
సంపత్ కుమార్ శాస్త్రి గారూ ! బ్లాగునకు స్వాగతము.
నిస్సంసారిగా మార్చిన మీ పూరణ బాగుంది.
నా పూరణ లో "ప్రవృత్తి" లో మొదటి రెండక్షరములు గగ ము అవుతుందను కున్నాను. సవరణకు ధన్యవాదములు.
Post a Comment