ప్రజ-పద్యం ఫేస్ బుక్ గ్రూప్ వారు నిర్వహించిన సామాజిక పద్య రచన పోటీ కొరకు 13-08-2017 న వ్రాసిన పద్యములు.
పద్య పక్షం - 8
“సమాజ శ్రేయస్సు--నా కర్తవ్యం”
కం:
దేశమన మట్టిగాదని
దేశమనగ మనుషులనుచు తెలియగవలె నీ
దేశమ్మేమిచ్చెననక
దేశమునకు నీవిడునది తెలియుచు నిడుమా.
కం:
ఎన్నికవేళల నేతల
మన్నిక దలపోసి యెన్న మాన్యుడవీవే
ఎన్ని కలలైన దీరును
మన్నిక నీనోటవడక మను పాలనయే.
మత్తకోకిల:
ఈసురోమని నీరసింపకు మేదిసేయకనుండుచున్
ఈస బోవనియాశతోడ పరేశు దల్చుచు శ్రద్ధగా
ఈసడింపక నేటి దుస్థితి మార్చగావలె బూనుచున్
ఈసమాజము నిన్ను మెచ్చగ నీయగావలె శ్రేయముల్.
ఆ.వె.
భేదభావములను విడనాడి స్ఫూర్తితో
స్వచ్ఛభారతమ్ము సాగుజేయ
శ్రేయఫలములింక చేరుగా చేరువగ
కర్మజేయుమింక ధర్మముగను.
తేటగీతి:
దురలవాటను దారిలో దూరకుండ
మంచి నడవడినేరిచి మహిని నిలచి
ఒరులక్షేమమ్ము గోరుచు నోర్మితోడ
నాదుకర్తవ్యమిదియని నడువుమయ్య.
పద్య పక్షం - 8
“సమాజ శ్రేయస్సు--నా కర్తవ్యం”
కం:
దేశమన మట్టిగాదని
దేశమనగ మనుషులనుచు తెలియగవలె నీ
దేశమ్మేమిచ్చెననక
దేశమునకు నీవిడునది తెలియుచు నిడుమా.
కం:
ఎన్నికవేళల నేతల
మన్నిక దలపోసి యెన్న మాన్యుడవీవే
ఎన్ని కలలైన దీరును
మన్నిక నీనోటవడక మను పాలనయే.
మత్తకోకిల:
ఈసురోమని నీరసింపకు మేదిసేయకనుండుచున్
ఈస బోవనియాశతోడ పరేశు దల్చుచు శ్రద్ధగా
ఈసడింపక నేటి దుస్థితి మార్చగావలె బూనుచున్
ఈసమాజము నిన్ను మెచ్చగ నీయగావలె శ్రేయముల్.
ఆ.వె.
భేదభావములను విడనాడి స్ఫూర్తితో
స్వచ్ఛభారతమ్ము సాగుజేయ
శ్రేయఫలములింక చేరుగా చేరువగ
కర్మజేయుమింక ధర్మముగను.
తేటగీతి:
దురలవాటను దారిలో దూరకుండ
మంచి నడవడినేరిచి మహిని నిలచి
ఒరులక్షేమమ్ము గోరుచు నోర్మితోడ
నాదుకర్తవ్యమిదియని నడువుమయ్య.
No comments:
Post a Comment