తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Thursday 19 April 2018

సమాజ శ్రేయస్సు--నా కర్తవ్యం

ప్రజ-పద్యం ఫేస్ బుక్ గ్రూప్ వారు నిర్వహించిన సామాజిక పద్య రచన పోటీ కొరకు 13-08-2017 న వ్రాసిన  పద్యములు.



పద్య పక్షం - 8 

“సమాజ శ్రేయస్సు--నా కర్తవ్యం” 


కం: 
దేశమన మట్టిగాదని 
దేశమనగ మనుషులనుచు  తెలియగవలె నీ   
దేశమ్మేమిచ్చెననక 
దేశమునకు నీవిడునది తెలియుచు నిడుమా. 

కం:
ఎన్నికవేళల నేతల 
మన్నిక దలపోసి యెన్న మాన్యుడవీవే 
ఎన్ని కలలైన దీరును 
మన్నిక నీనోటవడక మను పాలనయే. 

మత్తకోకిల: 
ఈసురోమని నీరసింపకు మేదిసేయకనుండుచున్  
ఈస బోవనియాశతోడ  పరేశు దల్చుచు శ్రద్ధగా   
ఈసడింపక నేటి దుస్థితి మార్చగావలె బూనుచున్ 
ఈసమాజము నిన్ను మెచ్చగ నీయగావలె శ్రేయముల్.   
ఆ.వె. 
భేదభావములను విడనాడి స్ఫూర్తితో
స్వచ్ఛభారతమ్ము సాగుజేయ 
శ్రేయఫలములింక చేరుగా చేరువగ 
కర్మజేయుమింక ధర్మముగను. 

తేటగీతి:
దురలవాటను దారిలో దూరకుండ  
మంచి నడవడినేరిచి మహిని నిలచి 
ఒరులక్షేమమ్ము గోరుచు నోర్మితోడ
నాదుకర్తవ్యమిదియని నడువుమయ్య.    

No comments: