శ్రీ చింతా రామకృష్ణారావు గారు "ఆంధ్రామృతం" బ్లాగునందు 17-09-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య - "క, చ, ట, త, ప" అనే అక్షరాలు లేకుండా సీతాకల్యాణం గురించి
ఆ.వె: వెలుగు లీను విశ్వ విభుడైన రాముని
మోము జాబిలాయె, ముగ్ధ యైన
మైథిలీ ముఖమ్ము మందమౌ వెన్నెల
జల్ల, వేరు గాని జంట యైరి.
మోము జాబిలాయె, ముగ్ధ యైన
మైథిలీ ముఖమ్ము మందమౌ వెన్నెల
జల్ల, వేరు గాని జంట యైరి.
2 comments:
నిషిద్ధవర్ణముల్ త్యజించి,నేర్పు మీర పద్యముల్
వసుంధరన్ మహాకవుల్ ప్రభావ మొప్ప వ్రాతురే!
లసన్మనోజ్ఞ సత్ స్వభావ! లక్షణ ప్రశస్తమై
పసందుగా రచించనేర్చి, భాగ్యశాలివైతివే!
ఆర్యా ! రామకృష్ణారావు గారూ ! ధన్యవాదములు.
Post a Comment