శ్రీ చింతా రామకృష్ణా రావు గారు "ఆంధ్రామృతం" బ్లాగునందు 23-08-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య - మాటలు తప్పువారె బహుమాన్యులు పూజ్యులు వందనీయులున్
మ: హనుమచ్ఛాస్త్రి హృదంతరాళమును మాయాదౌష్ట్య దుర్మార్గులౌ
మనుజుల్ చేసెడి మోసముల్, గనెడి సమ్మాన్యంబులున్, కల్చె. బా
ధనువ్యక్తంబును చేసె నద్భుతముగా ధన్యాత్ముడీతండు.స
జ్జన సంస్కారము పూరణంబు తెలిపెన్. సన్మాన్యుడీతండిలన్.
సమస్య - మాటలు తప్పువారె బహుమాన్యులు పూజ్యులు వందనీయులున్
ఉ: మాటల జెప్పియెన్నికల మాయలు జేయుచు గద్దె నెక్కు; మో
మాటము లెందుకయ్య, మది మానవ ! మానవ? వారి మెచ్చుటన్ !
కోటలు గట్టు వారె ! మరి కూర్చుని మూటలు గట్టు వారె! హా!
మాటలు తప్పువారె! బహుమాన్యులు పూజ్యులు వందనీయులున్!
మాటము లెందుకయ్య, మది మానవ ! మానవ? వారి మెచ్చుటన్ !
కోటలు గట్టు వారె ! మరి కూర్చుని మూటలు గట్టు వారె! హా!
మాటలు తప్పువారె! బహుమాన్యులు పూజ్యులు వందనీయులున్!
శ్రీ చింతా వారి స్పందన
మ: హనుమచ్ఛాస్త్రి హృదంతరాళమును మాయాదౌష్ట్య దుర్మార్గులౌ
మనుజుల్ చేసెడి మోసముల్, గనెడి సమ్మాన్యంబులున్, కల్చె. బా
ధనువ్యక్తంబును చేసె నద్భుతముగా ధన్యాత్ముడీతండు.స
జ్జన సంస్కారము పూరణంబు తెలిపెన్. సన్మాన్యుడీతండిలన్.
No comments:
Post a Comment