తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Tuesday 4 October 2011

మాటలు తప్పువారె బహుమాన్యులు పూజ్యులు .......

శ్రీ చింతా రామకృష్ణా రావు  గారు "ఆంధ్రామృతం" బ్లాగునందు 23-08-2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

                   
                 సమస్య -  మాటలు తప్పువారె బహుమాన్యులు పూజ్యులు వందనీయులున్


ఉ: మాటల జెప్పియెన్నికల మాయలు జేయుచు గద్దె నెక్కు; మో
     మాటము లెందుకయ్య, మది మానవ ! మానవ? వారి మెచ్చుటన్ !
     కోటలు గట్టు వారె ! మరి కూర్చుని మూటలు గట్టు వారె! హా!
     మాటలు తప్పువారె! బహుమాన్యులు పూజ్యులు వందనీయులున్!
                              
                          శ్రీ చింతా వారి స్పందన


మ: హనుమచ్ఛాస్త్రి హృదంతరాళమును మాయాదౌష్ట్య దుర్మార్గులౌ
      మనుజుల్ చేసెడి మోసముల్, గనెడి సమ్మాన్యంబులున్, కల్చె. బా
      ధనువ్యక్తంబును చేసె నద్భుతముగా ధన్యాత్ముడీతండు.స
      జ్జన సంస్కారము పూరణంబు తెలిపెన్. సన్మాన్యుడీతండిలన్.

No comments: