తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Tuesday 19 June 2012

రాళ్ళు గలిగినవాఁడె పో రాజు నేఁడు.


శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 27-07-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - రాళ్ళు గలిగినవాఁడె పో రాజు నేఁడు.

తేటగీతి: 
చంద్రు డన నాడు మామయ్య, చక్కనయ్య
సిరికి తమ్ముడు, చూడగా చెలియ వినుము
బూది కుప్పలు గుంటలు బోలెడన్ని 
రాళ్ళు గలిగినవాఁడె పో రాజు నేఁడు.


తేటగీతి:
రూక లేనట్టి వానిని రోసి జగము
పైకమున్న వానిని తలపైన బెట్టు
కొనును,కలిలోన నేమనుకొన్న "నాల్గు
రాళ్ళు గలిగినవాఁడె పో రాజు నేఁడు."

1 comment:

Murthy K v v s said...

ee site chaala baagundi.