కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 15-05-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య - విద్య యొసగునే వినయంబు వెఱ్ఱిగాక
తేటగీతి:
బుద్ధి,సుద్దులు నేర్పెడు విద్దె వదలి
శాస్త్ర విజ్ఞాన, గణితము చాలు ననుచు,
బట్టి బట్టుచు 'నాబ్జెక్టు' బాట నడువ;
విద్య యొసగునే వినయంబు వెఱ్ఱిగాక!
శాస్త్ర విజ్ఞాన, గణితము చాలు ననుచు,
బట్టి బట్టుచు 'నాబ్జెక్టు' బాట నడువ;
విద్య యొసగునే వినయంబు వెఱ్ఱిగాక!
No comments:
Post a Comment