శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 14 -03 -2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య : అర్జునునకు మిత్రు డంగ రాజు
ఆ.వె : "కదన మందు నేను కాలుని గానౌదు
నర్జునునకు" - మిత్రు డంగ రాజు
బాస చేతు ననుచు బాహాటముగ జెప్పె
రాజరాజు కపుడు రాజ సభను.
No comments:
Post a Comment