శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 11 -03 -2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య : విగ్రహముల పైన నాగ్రహమ్ము
ఆ.వె : నిగ్రహమును వీడి నేడు చూపితి వీవు
విగ్రహముల పైన నాగ్రహమ్ము!
విగ్రహముల? కావు? విజ్ఞత తోజూడ
తాత,తాతతాత,తనువు లవియె!
ఆ.వె : నిగ్రహమును వీడి నేడు చూపితి వీవు
విగ్రహముల పైన నాగ్రహమ్ము!
నీదు తాత,మామ,స్నేహితుండును,భార్య
ఆంధ్ర వారు కాగ అపుడు యెటుల?
ఆ.వె : నిగ్రహమును వీడి నేడు చూపితి వీవు
విగ్రహముల పైన నాగ్రహమ్ము!
చదువు నేర్పి బుద్ధి చక్కదిద్దిన ఒజ్జ
నేమి జేతు వాంధ్ర నేల కాగ ?
No comments:
Post a Comment