శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 21-02 -2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.
సమస్య: మాతృ భాషాభిమానమ్ము మనకు వద్దు.
సమస్య: మాతృ భాషాభిమానమ్ము మనకు వద్దు.
తే.గీ:   తమిళ తమ్ముళ్ళ తపనను తలచుకొనుము, 
           మాతృ భాషాభిమానమ్ము మనకు ముద్దు
           నల్ల ముఖమును వేయకు; తెల్ల వారి 
           మాతృ భాషాభిమానమ్ము మనకు వద్దు.
 తే.గీ:   తెలుగు భాషను బలుకగ తెగులటంచు 
           ఆంగ్ల భాషను నేర్వగ నాత్ర పడుచు
           తేనె వదలుదు వదియేల? తెల్ల వారి 
           మాతృ భాషాభిమానమ్ము మనకు వద్దు.  
 
 
1 comment:
రాయల కాలం నాటి దేశభాషలందు తెలుగులెస్స అన్న మాటను మరల గుర్తుకు తెచ్చిన శాస్త్రి గారికి ధన్యవాదములు
Post a Comment