శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 10 -03 -2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య : మెల్ల కన్ను వలన మేలు కలిగె.
ఆ.వె : బలినొసంగ నెంచి మాంత్రికుండొక్కడు
మాటు వేసి పట్టి 'మంగ పతిని'
వాని కళ్ళు చూచి, వదలెను వలదని
మెల్ల కన్ను వలన మేలు కలిగె.
2 comments:
భార్య ప్రక్కనున్న పడతి అందాలను
రసికుడొకడు చూచి రక్తి నొందె -
భర్త చూపు భార్యపై ననుకొనిరెల్ల -
మెల్ల కన్ను వలన మేలు కలిగె!
ఫణీంద్ర గారికి నమస్కారములు.సుస్వాగతం.
నా బ్లాగును వీక్షించి సరస పూరణను చవి జూపిన మీకు ధన్యవాదములు.
Post a Comment