శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 18 - 08 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - నరసింహా నిన్ను నమ్మి నాశన మైతిన్
హరి లేడూ, గిరి లేడూ అని వాదించి చివరకు నర సింహుని రూపంలో నున్న హరిని జూచి నోట మాట రాక హతమై పోతూ హిరణ్య కశిపుడు ఇలా అనుకొని వుంటాడని నా భావన....
కందము:
వర పుత్రుడు యశమును గను
నరసింహా! నిన్ను నమ్మి, నాశన మైతిన్
నరసింహా నిను నమ్మక
హరి గిరి లేడని మదించి హతమౌ చుంటిన్!
సమస్యకు నా పూరణ.
సమస్య - నరసింహా నిన్ను నమ్మి నాశన మైతిన్
హరి లేడూ, గిరి లేడూ అని వాదించి చివరకు నర సింహుని రూపంలో నున్న హరిని జూచి నోట మాట రాక హతమై పోతూ హిరణ్య కశిపుడు ఇలా అనుకొని వుంటాడని నా భావన....
కందము:
వర పుత్రుడు యశమును గను
నరసింహా! నిన్ను నమ్మి, నాశన మైతిన్
నరసింహా నిను నమ్మక
హరి గిరి లేడని మదించి హతమౌ చుంటిన్!
No comments:
Post a Comment