శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 28-06-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - ఆంధ్ర కేసరి.
తేటగీతి:
రొమ్ము జూపుచు చావును రమ్మనుచును
తెలుగు తెగువను తెలిపెను 'వెలుగు యొజ్జ'
కేసరి యను నామ మతనికే సరి యని
ఆంధ్ర మాతయె పలికిన యాప్త మూర్తి.
No comments:
Post a Comment