శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 21-02 -2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య: మాతృ భాషాభిమానమ్ము మనకు వద్దు.
సమస్య: మాతృ భాషాభిమానమ్ము మనకు వద్దు.
తే.గీ: తమిళ తమ్ముళ్ళ తపనను తలచుకొనుము,
మాతృ భాషాభిమానమ్ము మనకు ముద్దు
నల్ల ముఖమును వేయకు; తెల్ల వారి
మాతృ భాషాభిమానమ్ము మనకు వద్దు.
తే.గీ: తెలుగు భాషను బలుకగ తెగులటంచు
ఆంగ్ల భాషను నేర్వగ నాత్ర పడుచు
తేనె వదలుదు వదియేల? తెల్ల వారి
మాతృ భాషాభిమానమ్ము మనకు వద్దు.
1 comment:
రాయల కాలం నాటి దేశభాషలందు తెలుగులెస్స అన్న మాటను మరల గుర్తుకు తెచ్చిన శాస్త్రి గారికి ధన్యవాదములు
Post a Comment