Thursday, 16 May 2013

పాండు తనయుల మించిన పాపులెవరు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 29-04-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - పాండు తనయుల మించిన పాపులెవరు

తేటగీతి:
ధర్మ మేనాడు వీడక ధరణి లోన
పదియు మూడేండ్లు సైచిరి పరమ కష్ట
ములను పాపమ్ము దలచిరి మూర్ఖులపయి
పాండు తనయుల మించిన పాపులెవరు?

No comments:

Post a Comment