Friday, 8 July 2011

శంకరాభ(పూ)రణం - ఆడు వారిని తన్నుటే న్యాయ మగును

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 08 -03 -2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

                   సమస్య: ఆడు వారిని తన్నుటే న్యాయ మగును

తే.గీ:  బ్రతుకు తెరువుకు వచ్చిన పడతుల తన
          అమ్మ, చెల్లాయి,నక్కయ్య,నాత్మ మరచి
         
ఆట బొమ్మగ భావించి, అమ్ము కొనుచు
          ఆడు వారిని; తన్నుటే న్యాయ మగును. 

2 comments:

  1. ఉత్తముల వద్ద మంచిగా నుండ వలెను.
    అట్టి సుకృతికి సత్కృతి హాయి గొలుపు.
    చేటు కలిగించు వినరాని చెడ్డ మాట
    లాడు వారిని తన్నుటే న్యాయ మగును

    ReplyDelete
  2. చింతా రామ కృష్ణారావు గారికి సుస్వాగతం. ధన్యవాదములు.

    చింత లేదయ్య నాకిక చేరి జూచి
    బ్లాగు దర్శించి బోధించు వారు యుండ
    స్వాగతమ్మిదె మీకిక సరస హృదయ
    మరల మరలను వీక్షించ మనవి జేతు.

    ReplyDelete